Wednesday, September 18, 2024
spot_img

Telangana: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి

Telangana : కత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద ఆ మహానేత చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మహానేత వైఎస్సార్ సేవలను కొనియాడారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ అనేక సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలను గెలిచిన మహానేత వైస్సార్ అని కొనియాడారు. సమకాలీన రాజకీయాల్లో వైస్సార్ లోటు తీరనిది అని అన్నారు. వైస్సార్ ఆశయాల సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.
- Advertisment -spot_img

తాజా వార్తలు