Telangana : ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పని వారుల సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన గౌడ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా కోటగిరి మండల గౌడ కులస్తులు గీతా కార్మికులు గీతా పని వారుల సంఘం నాయకులు కోటగిరి బస్టాండ్ ఆవరణలో టపాసులు కాల్చి సీట్లు పంచుకోవడం జరిగింది.
Also Read : కత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయం సాక్షి గా కుంట్టలని తలపిస్తున్న రోడ్డు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విటల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అంచలంచలుగా ఎదిగి నాయకుడని ఈరోజు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ముందుగా ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో గౌడ కులస్తులు రాజకీయంగా ఎదగాలని బీసీలకు చట్టసభ లలో రిజర్వేషన్లు పెంచాలని అప్పుడే బీసీ బిడ్డలకు న్యాయం కలుగుతుందని అన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్
తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం మండల నాయకులు కొత్తపల్లి శ్రీధర్ గౌడ్ పండరి గౌడ్ రాజా గౌడ్ మండల గౌడ సంఘం నాయకులు ఏ గంగా ప్రసాద్ గౌడ్ ఏ చరణ్ గౌడ్ మల్లేష్ గౌడ్ శంకర్ గౌడ్ కోటగిరి టిసిఎస్ అధ్యక్షులు డి శంకర్ గౌడ్ ఉపాధ్యక్షులు ఆర్. అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు